నేడే ఉప ఎన్నికల నోటిఫికేషన్

నేడే ఉప ఎన్నికల నోటిఫికేషన్

మే 8న కడప, పులివెందులలో ఎన్నికలు

హైదరాబాద్: కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అధికారవర్గాల సమాచారం మేరకు నామినేషన్ల దాఖలకు ఈనెల 18ని ఆఖరు తేదీగా నిర్ణయించారు. 19న నామినేషన్ల పరిశీలన, 21లోపు వాటిని ఉపసంహరించుకునే గడువు ఉంటుంది. మే 8వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మే 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎన్నికల నిబంధనల మేరకు మే నెల 15వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియనంతా పూర్తి చేయాలి.