నేడు ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలు

నేడు ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పరీక్ష ఫలితాఫలితాలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలను గురువారం ప్రకటించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. మంత్రి పార్థసారథి ఉదయం 11.30కి జనరల్, వొకేషనల్ పరీక్షల ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేస్తారు. వెంటనే ఫలితాలను వెబ్‌సైట్లు, ఫోన్, ఈసేవా కేంద్రాలు, ఎస్‌ఎంఎస్ ద్వారా తెలుసుకునేందుకు బోర్డు ఏర్పాట్లు చేసింది. సబ్జెక్టుల వారీగా మార్కులను బీఎస్‌ఎన్‌ఎల్ ఐవీఆర్‌ఎస్(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్)తోపాటు నాలుగు ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఈసేవా కేంద్రాలు, ఏపీ ఆన్‌లైన్‌లో వెల్లడించేలా సన్నాహాలు చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు మొబైల్ ఫోన్‌లో ఎస్‌ఎంఎస్‌తో మార్కులు పొందవచ్చు. ప్రైవేట్ వెబ్‌సైట్ల ద్వారా గ్రేడ్ల వివరాలను తెలుసుకోవచ్చు.

ఏపీ ఆన్‌లైన్, పరిష్కారం కాల్ సెంటర్ల ద్వారా మార్కులు: ఏపీ ఆన్‌లైన్ సేవా కేంద్రాల్లోనూ విద్యార్థులు మార్కులను తెలుసుకోవచ్చు. దీనికోసం పరిష్కారం కాల్ సెంటర్(ఈసేవా), పట్టణ ఈసేవా కేంద్రాలు, గ్రామీణ ఈసేవా(రాజీవ్ ఇంటర్నెట్) కేంద్రాల్లోని బీఎస్‌ఎన్‌ఎల్ ఫిక్స్‌డ్ ఫోన్‌లైన్ల ద్వారా 1100కు డయల్ చేయవచ్చు.

మార్కులు తెలిపే వెబ్‌సైట్లు ఇవీ...
http://examresults.ap.nic.in
www.aponline.gov.in
http://results.cgg.gov.in
www.esevaonline.com

గ్రేడ్‌లతో ఫలితాలు తెలిపే వెబ్‌సైట్లు
www.sakshi.com
www.sakshieducation.com

ఫోన్ కొడితే మార్కులు
బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ లేదా మొబైల్‌ఫోన్ ద్వారా 1255225 నంబర్‌కు ఫోన్ చేసి సబ్జెక్టుల వారీగా మార్కులు తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడినుంచి ఫోన్ చేసినా ఎస్టీడీ కోడ్ డయల్ చేయాల్సిన అవసరం లేదు.

ఎస్‌ఎంఎస్ ద్వారా
బీఎస్‌ఎన్‌ఎల్: interto 55352, 56300 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయవచ్చు.